భార్యకు కరోనా వచ్చిందని వాహనాలను కాల్చేశాడు

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 03:19 AM IST
భార్యకు కరోనా వచ్చిందని వాహనాలను కాల్చేశాడు

భార్యకు కరోనా వచ్చిందని వాహనాలు కాల్చేశాడో ఓ ప్రబుద్దుడు. మద్యం సేవించి..కిక్కు తలకు ఎక్కగానే..ఈ పని కానిచ్చేశాడు. మీ భార్యకు కరోనా వస్తే..మేమేం చేశాం..బాబు అంటూ తల బాదుకుంటున్నారు. ఇతను చేసిన పని వల్ల..తమకు నష్టం వచ్చిందని లబోదిబోమంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ లో చోటు చేసుకుంది. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా GHMC పరిధిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. లంగర్ హౌస్ ప్రాంతంలోని ప్రశాంత్ నగర్ ఓ కుటుంబం నివాసం ఉంటోంది. అయితే..ఓ వ్యక్తి భార్యకు కరోనా వైరస్ సోకింది. 2020, మే 19వ తేదీ మంగళవారం ఫ్రెండ్స్ తో ఇతను బాపూనగర్ లో మద్యం సేవించాడు. తర్వాత..రెండు బైక్స్, ఓ ఆటోకు నిప్పు పెట్టి..కాల్చిపారేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు..ఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇక కరోనా విషయానికి వస్తే…తెలంగాణ కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. 2020, మే 20వ తేదీ బుధశారం కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులే నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,661కు చేరుకుంది. కోవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 మంది మృత్యువాతపడ్డారు. 608 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1,013 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.(తెలంగాణలో కరోనా : గోషామహల్ లో ఒకే ఇంట్లో 8 మందికి వైరస్)