Murder : 12ఏళ్లు ప్రేమించాడు.. ఆ అనుమానంతో చంపేశాడు

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చాడు. కిరాతకంగా భార్యను కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.

Murder : 12ఏళ్లు ప్రేమించాడు.. ఆ అనుమానంతో చంపేశాడు

Husband Murder Wife

Husband Murder Wife : అనుమానం పెనుభూతమైంది. పన్నెండేళ్లుగా సాగుతున్న వారి ప్రేమ బంధంలో చిచ్చుపుట్టింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చాడు. కిరాతకంగా భార్యను కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా మరికల్‌ గ్రామానికి చెందిన సువర్ణ(32), రాజు దంపతులు. పన్నెండేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల కిందట హైదరాబాద్ నగరానికి వచ్చి గాజులరామారం బతుకమ్మబండలో ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అదే సమయంలో రాజులో అనుమానం మొదలైంది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. దీనిపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన వ్యక్తి ఇంటికి భార్యను పంపిన రాజు.. ఆ వెనకే తానూ వెళ్లాడు. పార కట్టెతో భార్యను కొట్టాడు. ఇది గమనించిన స్థానికులు రాజుకి సర్దిచెప్పారు. దాంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లాక రాజు మరింత రెచ్చిపోయాడు. మళ్లీ తీవ్రంగా సువర్ణను కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బుధవారం ఉదయం ఇరుగుపొరుగు వారి సాయంతో సువర్ణను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. క్షణికావేశంలో తండ్రి చేసిన పనికి ముగ్గురు చిన్నారులు తల్లి ప్రేమకు దూరం అయ్యారు.