లండన్లో హైదరాబాద్ యువకుడు హత్య
లండన్లో హైదరాబాద్ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాతబస్తీలోని నూర్ ఖాన్ బజార్కు చెందిన నజీముద్దీన్.. భార్యతో కలిసి లండన్లో నివాసం ఉంటున్నాడు. ఆరేళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఓ కేఫ్లో నజీముద్దీన్ పని చేస్తుండగా.. అతని భార్య డాక్టర్గా పని చేస్తోంది.
టెక్కో సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న నజీముద్దీన్.. వర్క్ అవర్స్ పూర్తయిన తర్వాత కూడా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. దీంతో కుటుంబ సభ్యులు సూపర్ మార్కెట్ యాజమాన్యానికి కంప్లయింట్ చేశారు. దీంతో సిబ్బంది సూపర్ మార్కెట్ మొత్తం పరిశీలించినా కనిపించలేదు.
Also Read : భారతదేశపు డివైడర్… మోడీపై టైమ్స్ వివాదాస్పద హెడ్ లైన్
పోలీసులకు కంప్లయింట్ చేశారు. సిబ్బందితోపాటు పోలీసులు గాలింపులో మార్కెట్ ఆవరణలోని పార్కింగ్ ప్రదేశంలోని ఓ చోట చనిపోయిన కనిపించాడు నజీముద్దీన్. అతన్ని కత్తులతో పొడిచి చంపినట్లు తెలిసింది. నజీముద్దీన్ ను ఎవరు చంపారు.. హత్యకు ముందు ఏం జరిగింది.. ఎందుకు చేశారు అనే విషయాలపై విచారణ చేస్తున్నారు లండన్ పోలీసులు.
నజీముద్దీన్ హత్యకు గురయ్యాడని తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Also Read : OMG : ఆడుకునే బొమ్మ మింగి.. నటుడి కుమార్తె మృతి
Hyderabad native Mohd Nadeemuddin who was working at a mall in Tesco supermarket & had been living in London for past 6 years, was stabbed to death in Slough on Wednesday. Case registered, investigation underway. Family has appealed to EAM Sushma Swaraj to help them go to London pic.twitter.com/XcAumU8mfX
— ANI (@ANI) May 10, 2019