Hyderabad : కుటుంబాన్ని కిడ్నాప్ చేసి, కత్తులతో కోశారు, క్యాండిల్‌‌తో కాల్చారు

గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి...చిత్ర హింసలు పెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో రెండేండ్ల పాపతో పాటు నెల వయస్సున్న బాబు ఉన్నాడు.

Hyderabad : కుటుంబాన్ని కిడ్నాప్ చేసి, కత్తులతో కోశారు, క్యాండిల్‌‌తో కాల్చారు

Kidnap

Kidnapped : నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. లావాదేవీలు, కుటుంబ తగదాల కారణంగా కొంతమంది కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కిడ్నాప్ లు చేయడం..హత్యలు చేయడం సర్వసాధరణమై పోయింది. తాజాగా..గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి…చిత్ర హింసలు పెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో రెండేండ్ల పాపతో పాటు నెల వయస్సున్న బాబు ఉన్నాడు. ఆర్థిక వివాదాల కారణంగా కిడ్నాప్ చేసి ఉంటారని తెలుస్తోంది.

Read More : Spicejet Plane Services : గన్నవరం నుంచి స్పైస్‌జెట్ విమాన సర్వీసులు రద్దు

వనపర్తిలో శ్రీకాంత్ చారి కుటుంబం నివాసం ఉంటోంది. భార్య, పాప, బాబుతో ఉంటున్నారు. వీరిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మహబూబ్ నగర్ కు తీసుకొచ్చి  ఓ గదిలో బంధించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు శ్రీకాంత్ చారి కుటుంబానికి నరకం చూపెట్టారు. ఇలా ఒక్క రోజు కాదు..రెండు రోజులు కాదు. ఏకంగా వారం రోజులు చిత్రహింసలు పెట్టారు. తాళ్లతో కట్టేసి..కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. శరీరాలపై కత్తులతో ఎక్కడపడితే అక్కడ కోశారు. రక్తం కారుతూ..వాళ్లు విలవిలలాడుతున్నా..దుండగులు కనికరించలేదు.

Read More : Guinness Records: ఉల్లిపాయలాంటి చిన్నది..ఒక్క నిమిషంలో ఎన్నిడ్రెస్సులు మార్చిందో

అంతేగాకుండా..క్యాండిల్ వెలిగించి కాలుస్తూ..రాక్షసానందం పొందారు. ఇందులో శ్రీకాంత్ భార్యను సైతం వదలలేదు దుర్మార్గులు. ఆమెను సైతం అలాగే కొట్టారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రధానంగా శ్రీకాంత్ చారి తీవ్రంగా గాయపడ్డాడు. వీరు బయటపడిన తర్వాత..ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాంత్ చారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. శ్రీకాంత్ చారి భార్య, పాప, బాబు ఆరోగ్య పరిస్థితి తెలియరాలేదు. ఆర్థిక వివాదాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగిందని సమాచారం. చంద్రయ్య, మరో ఆరుగురు ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.