Mumbai: వృద్ధ మహిళపై రాజకీయ నేత దాడి.. వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం

తన షాపు ముందు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కర్రలు తీసేయమని కోరినందుకు ఒక వృద్ధ మహిళపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు ఎమ్ఎన్ఎస్ పార్టీకి చెందిన నేత. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో గత నెలలో జరిగింది.

Mumbai: వృద్ధ మహిళపై రాజకీయ నేత దాడి.. వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం

Mumbai: వృద్ధ మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడో రాజకీయ నేత. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఒక వృద్ధ మహిళ షాపు ముందు ఎమ్ఎన్ఎస్ (మహారాష్ట్ర నిర్మాణ సేన)  పార్టీకి చెందిన ఒక నాయకుడు వెదురు కర్రలు పాతాడు.

Kishan Reddy: ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఒక వ్యాపార ప్రకటన కోసం వీటిని ఏర్పాడు చేశాడు. అయితే, అక్కడే ఉన్న షాపు యజమాని అయిన మహిళ అనుమతి మాత్రం తీసుకోలేదు. దీనిపై ఆ మహిళ అతడిని ప్రశ్నించింది. ఆ కర్రలు తీసేయాలని కోరింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి వృద్ధ మహిళ అని కూడా చూడకుండా.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మహిళ కింద పడ్డా ఊరుకోకుండా తిరిగి దాడి చేశాడు. మహిళను అతడు అసభ్య పదజాలంతో దూషించాడు. చుట్టూ చాలా మంది చూస్తున్నా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గత నెల 28న జరిగిన ఈ ఘటనను అక్కడున్న వాళ్లలో కొందరు వీడియో కూడా తీశారు.

Revanth Reddy: జవాన్ల మరణాలను రాజకీయాలకు వాడుకుంటున్న కేసీఆర్: లేఖలో విమర్శించిన రేవంత్ రెడ్డి

ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని వినోద్ అర్గిలేగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.