ఇంజనీరింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

  • Published By: venkaiahnaidu ,Published On : December 19, 2019 / 09:48 AM IST
ఇంజనీరింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో బుధవారం(డిసెంబర్-18,2019)ఈ దారుణం చోటుచేసుకుంది. యాసిడ్ దాడిలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. 

కల్ బందా గ్రామానికి చెందిన బాధిత యువతి నాగపూర్ లోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకుంటోంది. బుధవారం బాధిత యువతి  కాలేజీకి వెళ్లేందుకు బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ముఖానికి మాస్క్ లు ధరించి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు యువతిపై యాసిడ్ పోశారు. తరువాత అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే యువతిని స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆ యువతిని నాగ్ పూర్ కి తరలించారు. కేసెు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకొని వాచారిస్తున్నారు.

 కొద్దిరోజులుగా ఆ ఇద్దరు యువకులు బాధిత యువతిని వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని సమాచారం. అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.