Khammam : ఇద్దరు పిల్లలతోపాటు వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య

వివాహిత ముందుగా తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసింది. అనంతరం తానూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Khammam : ఇద్దరు పిల్లలతోపాటు వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య

Khammam

Khammam : ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతోపాటు వివాహిత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు కుమారులను చెరువులోకి తోసేసి అనంతరం తానూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సత్తుపల్లిలో చోటు చేసుకుంది. మృతుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లిలో మృదుల అనే వివాహిత తన ఇద్దరు కుమారులు ప్రజ్ఞ(5), మహదేవ్(7)లతో కలిసి తామర చెరువులోకి దూకారు. వివాహిత ముందుగా తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసింది. అనంతరం తానూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Female Constable Suicide : తోటి ఉద్యోగి లైంగిక వేధింపులు.. చెరువులో దూకి మహిళా కానిస్టేబుల్ సూసైడ్

స్థానికులు చెరువులో ఈ ముగ్గురి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు మూడు మృతదేహాలను చెరువులో నుంచి బయటికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.