ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసిన పాస్టర్  

  • Published By: murthy ,Published On : June 1, 2020 / 09:51 AM IST
ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసిన పాస్టర్  

జనులకు దైవ సందేశాలు చెప్పాల్సిన పాస్టర్ యువతికి ప్రేమ సందేశం పంపించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి  కోరికలు తీర్చుకున్నాడు. యువతి గర్భం  దాల్చేసరికి అబార్షన్ చేయించాడు.  మోజు తీరాక ప్రియురాలిని దూరం పెట్టి..మరోక యువతిని పెళ్ళి చేసుకుని ఇంటికొచ్చాడు. 

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నెల్లిపట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని జంగాల అగ్రహారంలో రాజ్ కుమార్ అనే యువకుడు పాస్టర్ గా పనిచేస్తున్నాడు.  అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని…  ఆరేళ్లుగా ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి  శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమెతోతన కామ కోరికలు తీర్చుకుని గర్భవతిని చేశాడు. తీరా గర్భం వచ్చిందని తెలియగానే ధనలక్ష్మికి అబార్షన్ చేయించాడు.  ప్రియురాలిపై మోజు తీరిపోవటంతో కొన్నాళ్ళుగా ముఖం చాటేయటం మొదలెట్టాడు. ఆమెను తప్పించుకు తిరగసాగాడు. పాస్టర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ధనలక్ష్మి గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టింది. 

పాస్టర్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చాడు పాస్టర్ రాజ్ కుమార్. ప్రియురాలికిచ్చిన మాట పక్కన పెట్టి,  కొన్నాళ్ళకు  వేరోక అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు పాస్టర్. దీంతో మోసపోయిన బాధితురాలు  బైరెడ్డిపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచక పాస్టర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

Read: ప్రేమ పెళ్ళి….హీటర్ తో కొట్టి భార్యను హత్య చేసిన భర్త