లాక్‌డౌన్‌‌లో యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. యువతులతో వ్యభిచారం

  • Published By: naveen ,Published On : June 15, 2020 / 05:21 AM IST
లాక్‌డౌన్‌‌లో యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. యువతులతో వ్యభిచారం

హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక, తిండి దొరక్క పేదలు అల్లాడుతుంటే.. దాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు నీచులు. ఉపాధి కోసం వెతుకుతున్న యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. 

హైదరాబాద్ నగరానికి చెందిన అబ్దుల్‌ మిస్కిన్‌(30) దంపతులు సంపాదన కోసం అడ్డదారి ఎంచుకున్నారు. షేక్‌ ముస్తాక్‌(27) అనే ఆటో డ్రైవర్‌తో కలిసి ముంబై నుంచి ఇద్దరు యువతులను రప్పించారు. పాతబస్తీ, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో వ్యభిచారం చేయిస్తున్నారు. విటులు ఫోన్‌చేస్తే ఆటోలో షేక్‌ ముష్తాక్‌ ఆ యువతులను వారింటికి తీసుకువెళ్తాడు. మూడు రోజుల క్రితం శాస్త్రిపురం డివిజన్‌లోని కింగ్స్‌ కాలనీలో ఈ ముఠా మకాం ఏర్పాటు చేసుకుంది. విటులు వస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం(జూన్ 13,2020) అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులతో పాటు నగరానికి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను సంరక్షణ గృహానికి తరలించారు.