ఇంటర్ పరీక్షలకు వెళ్తూ విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా బైక్ పైనుంచి కింది పడి విద్యార్థి చనిపోయాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పొన్నెకల్ వద్ద మంగళారం (మార్చి 17, 2020) ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్ష రాసేందుకు ఇద్దరు విద్యార్థులు కలిసి బైక్పై వెళ్తున్నారు. వేగంగా వెళ్తుండడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడు డోర్నకల్కు చెందిన వివేక్గా పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read | కన్నా స్థానంలో కాబోయే బీజేపీ చీఫ్ ఎవరు? కమ్మ వర్గానికి ఇస్తారా