విహార యాత్రలో విషాదం :గోదావరిలో ముగ్గురు గల్లంతు

  • Published By: chvmurthy ,Published On : February 2, 2019 / 12:01 PM IST
విహార యాత్రలో విషాదం :గోదావరిలో ముగ్గురు గల్లంతు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా లో దారుణం జరిగింది.  కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సమీపంలో గోదావరి- కిన్నెరసాని సంగమం వద్ద స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మృతులు భద్రాచలం ఏరియా బూర్గంపహాడ్ మండలం పెద్దిరెడ్డి పాలెం వాసులుగా గుర్తించారు. గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు బర్త్ డే పార్టీ చేసుకునేందుకు గ్రామానికి సమీపంలోని  సంగమం వద్దకు వెళ్లారు. పార్టీలో భాగంగా అందరూ ఈత కొట్టడానికి గోదావరిలో దిగగా, ప్రమాదవశాత్తు మునిగిపోయి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
 
ఇది గమనించిన మిగిలిన ముగ్గురు యువకులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వటంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు నది ఒడ్డుకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతు అయిన వారు కుందురు శ్రీనివాసరెడ్డి, కారంపూడి శేషు, తిరుమలరెడ్డి శివ రెడ్డి గా గుర్తించారు.  పోలీసులు, గ్రామస్తులు, గజఈత గాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ  ప్రాంతంలో గోదావరి ఉధృతంగా ఉండటం, లోతుగా ఉండటంతో మృత దేహాలు లభ్యం కావటం కాస్త ఆలశ్యం అవవచ్చని తెలుస్తోంది.