Chennai: భర్త చేసిన పనికి హంతకురాలిగా మారిన భార్య.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

ప్రేమికుడుకోసం వెతుక్కుంటూ సుబ్బలక్ష్మీ కోయంబత్తూరు వచ్చింది. ప్రియుడు నివాసం ఉండే ఇంటి అడ్రస్సు తెలుసుకొని అక్కడికి వెళ్లింది. సుజైకి పెళ్లికావడంతో సుబ్బలక్ష్మీ, సుజై మధ్య గొడవ జరిగింది.

Chennai: భర్త చేసిన పనికి హంతకురాలిగా మారిన భార్య.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

Coimbatore Crime News

Chennai: తమిళనాడు రాష్ట్రంలో ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. ఎనిమిది నెలల గర్భిణీ అయిన ఆ వివాహిత సుబ్బలక్ష్మి అనే యువతిని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన కోయంబత్తూరులో సంచలనంగా మారింది. ఈ హత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వివాహిత, ఆమె భర్తను అరెస్టు చేశారు.

Illegal Relationship: ఇద్దరు ప్రియులతో గదిలో కోడలు.. అత్త చేసిన పనికి దిమ్మతిరిగిపోయింది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన సుజై అనే వ్యక్తి ఏడాది క్రితం రేష్మ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రేష్మతో పెళ్లికి ముందు సుబ్బలక్ష్మీ అనే యువతికి సుజైకి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అయితే, రేష్మతో పెళ్లి నిశ్చయం కావడంతో సుబ్బలక్ష్మిని కాదని రేష్మను పెళ్లి చేసుకున్నాడు సుజై. వారిద్దరూ కోయంబత్తూరులోని ఇడయార్ పాలయంలో నివాసం ఉంటున్నాడు.

Wife Illegal Relationship: భార్యపై అనుమానంతో ఆరేళ్ల కొడుకును చంపిన తండ్రి..

ప్రేమికుడుకోసం వెతుక్కుంటూ సుబ్బలక్ష్మీ కోయంబత్తూరు వచ్చింది. ప్రియుడు నివాసం ఉండే ఇంటి అడ్రస్సు తెలుసుకొని అక్కడికి వెళ్లింది. సుజైకి పెళ్లికావడంతో సుబ్బలక్ష్మీ, సుజై మధ్య గొడవ జరిగింది. అక్కడే ఉన్న సుజై భార్య రేష్మ తన భర్తను వదిలిపోవాలంటూ సుబ్బలక్ష్మీకి సూచించింది. అయినా సుబ్బలక్ష్మీ వినకపోవటంతో కత్తితో పొడిచి చంపింది. అనంతరం సుజై, రేష్మ ఇద్దరు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యచేసి పరారీలో ఉన్న రేష్మ, అందుకు కారణమైన ఆమె భర్త సుజైకోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వారు పోలాచ్చిలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి బుధవారం వారిని అరెస్టు చేశారు.