Illegal Relationship: ఇద్దరు ప్రియులతో గదిలో కోడలు.. అత్త చేసిన పనికి దిమ్మతిరిగిపోయింది..

ఉపాధి కోసం భర్త విదేశాలకు వెళ్లడంతో భార్య ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరితో మహిళ ఒకేగదిలో అసభ్యకర రీతిలో ఉండటాన్ని అత్త చూసింది.

Illegal Relationship: ఇద్దరు ప్రియులతో గదిలో కోడలు.. అత్త చేసిన పనికి దిమ్మతిరిగిపోయింది..

Illegal Relationship

Illegal Relationship: పెళ్లైన తరువాత వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటూ తమ కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారు కొందరు మహిళలు. ఇలాంటి తరహా కేసులు ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వివాహిత ఒకే గదిలో ఇద్దరు మగవారితో అభ్యంతర స్థితిలో ఉండటాన్ని అత్త గమనించింది. గదికి తాళంవేసి 112కు ఫోన్ చేసి పోలీసులకు విషయం చెప్పింది. పోలీసులు గ్రామానికి చేరుకొని చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Wife Illegal Relationship: భార్యపై అనుమానంతో ఆరేళ్ల కొడుకును చంపిన తండ్రి..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లా నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే యువకుడికి పక్క గ్రామంకు చెందిన యువతితో వివాహం అయింది. వివాహం అయిన కొద్దిరోజులకు సదరు వ్యక్తి ఉపాధికోసం సౌదీ అరేబీయా వెళ్లాడు. భర్త విదేశాలకు వెళ్లడంతో.. భార్య పక్కగ్రామంలోని తన పుట్టింటికి వెళ్లి వస్తుండేది. కొద్దికాలానికి పుట్టింటి వద్ద తనకు బంధువులైన ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. తన పుట్టింటికి వెళ్లినప్పుడల్లా వారిద్దరిని కలిసి వస్తుండేది.

Illegal Relationship: భర్తను హత్యచేసి ప్రియుడితో పరారైన భార్య.. కూతురు ఫిర్యాదుతో ఆర్నెళ్లకు పోలీసులకు చిక్కిన నిందితులు..

కొద్దికాలం పాటు వివాహిత ఈ వ్యవహారంను గుట్టుచప్పుడు కాకుండా సాగిందింది. అత్తవారింటికి వచ్చిన తరువాత కొద్దిరోజులకు వారిద్దరిని నేరుగా ఇంటికి పిలవడం మొదలు పెట్టింది. అత్తామామలకు బంధువులేనని, తమ అమ్మవారి తరపు వారని చెప్పేది. పలుసార్లు వాళ్లు ఇంటికి వచ్చిపోతుండటంతో అత్తకు అనుమానం వచ్చింది. ఓ రోజు ఇద్దరు వ్యక్తులు ఇంటికిరాగా.. తన కోడలు, ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉన్నారు. రూంలో వారు ఏం చేస్తున్నారో చూసేందుకు అత్తవెళ్లగా.. తన కోడలు ఆ ఇద్దరు వ్యక్తులతో అసభ్యకర రీతిలో ఉండటాన్ని చూసింది. కోడలు చేసే పనికి కంగుతిన్న అత్త.. రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకోవాలని భావించి.. రూం తలుపుకు తాళం వేసింది.

Chandrababu Naidu: రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..

112 నెంబర్‌కు డయల్ చేసి విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు అక్కడికి చేరుకొని వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. మహిళ తన కోడలుపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసులు వెళ్లి చూడగా.. కోడలు ఇద్దరు వ్యక్తులతో అభ్యంతరకర స్థితిలో ఉందని, దీంతో వారిపై కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి తెలిపారు.