ప్రత్యక్ష సాక్షి మాటల్లో : వివేకానందరెడ్డిని మొదట చూసింది ఎవరు
తలకు గాయం,బెడ్ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లెయింట్ చేసినట్లు వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు.
తలకు గాయం,బెడ్ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లెయింట్ చేసినట్లు వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు.
తలకు గాయం,బెడ్ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లెయింట్ చేసినట్లు వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. కంప్లెయింట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఉదయం 5.30గంటలకు వివేకా ఇంటికి వెళ్లాను. అప్పటికి ఆయన నిద్ర లేవలేదు. తలుపు తీయకపోవడంతో బయట కూర్చొని అరగంట పేపర్ చదివా. అరగంట తర్వాత అనుమానం వచ్చి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశా.. సార్ ఇంకా లేవలేదు లేపాలా? అని అడిగాను. నైట్ లేట్ గా వచ్చినట్లున్నారు.. లేపొద్దులేనని చెప్పారు. సరే అని మరో అరగంట పాటు బయటే వెయిట్ చేశా. ఇంతలో ఇంట్లో పనిచేసే లచ్చమ్మ, ఆమె కొడుకు వచ్చారు. సార్ ఇంకా పడుకునే ఉన్నారని చెప్పా. వెనక కిటికీ కొడితే లేస్తారు.. లేపండని పనిమనిషికి చెప్పా. కిటికీ కొడితే లేవలేదు.. నేను కూడా ప్రయత్నించా పలకలేదు.. గాఢ నిద్రలో ఉన్నాడని అనుకున్నాం. లేస్తాడులేనని అనుకున్నాం.
Read Also: వివేక హత్య సూత్రదారులు చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ : విజయసాయిరెడ్డి
మెయిన్ డోర్ మూసి ఉంది కానీ.. వెనుకున్న తలుపుకు గడియ లేదు. ఆ డోర్ ఓపెన్ అయినట్లు రంగన్న అనే వృద్ధుడు తెలిపాడు. లచ్చమ్మ కొడుకు ప్రకాష్, నేను ఇద్దరం లోపలికి వెళ్లాం. లోపలకు వెళ్లి చూడగా బెడ్రూమ్ తెరిచి ఉంది. బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్లో రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాను. ఆ డోర్ ఎందుకు తీసారా? అనే అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను అని కృష్ణారెడ్డి తెలిపారు.రోజూ ఉదయం 5.30 గంటలకు వివేకా నిద్రలేస్తారు అని తెలిపారు. వివేకా తలపై గాయం ఉందని..అదే విషయాన్ని కంప్లయింట్ లో రాశానని తెలిపారు.
Read Also: చిన్నాన్నను నరికి చంపారు – కేసును తప్పుదారి పట్టిస్తున్నారు అంటున్న జగన్