Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి ఆడబిడ్డను వేధిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారు. కొందరు దేశ సంపద దోచుకొని యూకేలో జల్సాలు చేస్తున్నారు. దోస్తులను వదిలేసి... తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారు. దేశాన్ని లూటీ చేసినోళ్ళను వదిలేస్తున్నారు.

Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి ఆడబిడ్డను వేధిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆడబిడ్డను వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డపై బాధ్యతగల వ్యక్తిగా కిషన్ రెడ్డి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం. ఏ ఆధారం లేకుండా ముందే ఉంహించి నవంబర్‌లోనే సెల్‌ఫోన్ ఉన్నాయా లేవా అంటూ.. నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఫోన్లు కావాలని ఈడీ సోమవారం అడిగితే, ఈ రోజు తీసుకెళ్లింది. ఫోన్లు ధ్వంసం చేయాల్సిన అవసరం కవితకు లేదు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? ఆయన తెలంగాణకు రాని మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ ప్రతిష్ఠకు భంగం కలిగించారు. అసభ్యకరంగా మాట్లాడారు. ముందే ఈ అంశంపై ఢిల్లీలో ఇద్దరు బిజెపి ఎంపీలు ఎలా మాట్లాడుతారు? దేశ ప్రజలారా ఆలోచించండి. ఉద్దేశపూర్వకంగా కెసిఆర్ ను ఎదుర్కోలేక ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నారు.

Salman Khan : సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు ఇమెయిల్.. 5 ఏళ్లగా మర్డర్ ప్లాన్.. అసలు కథ ఏంటి?

దేశంలో యువత, మేథావులు, నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఒక అడబిడ్డపై మీ ప్రతాపమా? ఇది రూ.100 కోట్ల స్కామ్ అయితే… మీ నిరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, అదానివి ఎన్ని లక్షల కోట్లు ఆవిరై పోయాయి. చోక్సీ భాయి చోక్సీ భాయి అని మాట్లాడారు కదా. చోక్సీ భాయిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకుంటూ… రెడ్ కార్పెట్ వేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారు. కొందరు దేశ సంపద దోచుకొని యూకేలో జల్సాలు చేస్తున్నారు. దోస్తులను వదిలేసి… తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారు. ఈడీ ఎప్పుడు పిలిచినా ఎమ్మెల్సీ కవిత విచారణకు వచ్చింది. ఊరికే గంటలు గంటలు కూర్చోబెట్టారు. కొన్ని టివి చానెళ్ల పైశాచికం ఆనందం ఏంటి? నాలుగో స్థంభంగా ఉన్న మీడియా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉన్నవి లేనట్టు… లేనివి ఉన్నట్టు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అడపిల్ల అని చూడకుండా ఫోన్లు ధ్వంసం చేశారని చెప్పాలనే ఆలోచన ఎలా వచ్చింది. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. దేశం లూటీ చేసినోళ్ళను వదిలేస్తున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఆడబిడ్డను పండుగ అని లేకుండా హింసిస్తున్నారు.

మీకు తగిన శాస్తి జరుగుతుంది. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మేము ఇచ్చిన లేఖపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పి క్షమాపణ కోరాలి. దేశంమీద గౌరవం ఉంటే… దేశాన్ని దోచుకునే వాళ్ళను ఢిల్లీ గడ్డపై ఉరితీయండి. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ధైర్యంగా ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాల్సి ఉంది. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని చెప్పిందే కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ బిడ్డ సింహం లా గర్జిస్తుంది. రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డపై పుట్టిన పులి బిడ్డ ఎమ్మెల్సీ కవిత’’ అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.