Chhattisgarh : మనిషి కాదు మృగం.. తల్లిదండ్రుల్ని, అమ్మమ్మను చంపి బూడిద చేశాడు
డ్రగ్స్కి బానిస అయినా 24 ఏళ్ల యువకుడు మృగంలా మారిపోయాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారని తల్లిదండ్రులు, అమ్మమ్మని మట్టుబెట్టాడు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ దారుణ సంఘటన సంచలనం రేపుతోంది.
Chhattisgarh Crime News : డ్రగ్స్కి బానిస అయిన ఓ యువకుడు కుటుంబ సభ్యులను డబ్బు కోసం వేధించేవాడు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించారని ఫ్యామిలీ మెంబర్స్ని ఘోరంగా హత్య చేశాడు. ఛత్తీస్గఢ్లో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఛత్తీస్గఢ్ మహాసమండ్ జిల్లా పుత్కాలో దారుణం జరిగింది. ఉదిత్ భోయ్ అనే 24 ఏళ్ల వ్యక్తి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం తల్లిదండ్రుల్ని వేధిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా తల్లిదండ్రులతో డబ్బు కోసం గొడవ పడ్డాడు. వారు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో తల్లిదండ్రులు, అమ్మమ్మను హాకీ స్టిక్తో కొట్టి చంపాడు. ఇంటి వెనుక చెక్కదుంగలు, శానిటైజర్ ఉపయోగించి మృతదేహాలను కాల్చేశాడు. చేసిన నేరం కప్పి పుచ్చుకునేందుకు ఉదిత్ తన తండ్రి ఫోన్ నుంచి బంధువులకు మెసేజ్లు పంపాడు. వైద్య చికిత్స కోసం రాయ్ పూర్ వెళ్లిన తన తల్లి జర్నా, తండ్రి ప్రభాత్ భోయ్, అమ్మమ్మ సులోచన కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Britain : పెన్షన్ డబ్బుల కోసం.. స్నేహితుడి మృతదేహాన్ని రెండేళ్లు ఫ్రిడ్జ్లో పెట్టిన వ్యక్తి..
మరోవైపు రాయ్పూర్లో చదువుకుంటున్న ఉదిత్ తమ్ముడు గ్రామానికి వచ్చాడు. తమ ఇంటి వెనుక ఉన్న కూరగాయల తోటలో బూడిదతో పాటు, గోడలపై రక్తపు మరకలు, ఎముక శకలాలు కనిపించడంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఉదిత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అతనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. విచారణలో ఉదిత్ నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు.