Punjab: సిద్ధూ హత్యతో దిగొచ్చిన ఆప్ సర్కారు.. వీవీఐపీలకు భద్రత కొనసాగింపు

వీవీఐపీలకు రాష్ట్రంలో సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు.

Punjab: సిద్ధూ హత్యతో దిగొచ్చిన ఆప్ సర్కారు.. వీవీఐపీలకు భద్రత కొనసాగింపు

Punjab

Punjab: వీవీఐపీలకు రాష్ట్రంలో సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు. పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

DGCA Fines Vistara: శిక్షణ పొందకుండానే విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్.. విస్తారాకు పది లక్షల జరిమానా

మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ సోనికి భద్రత తొలగిస్తూ గత నెల 11న రాష్ట్రంలోని ఆప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ఆయన హరియాణా-పంజాబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రాజ్ మోహన్ సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏ ప్రాతిపదికన భద్రత తొలగించాలనుకున్నారో తెలపాని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసు విచారణకు హాజరైన ప్రభుత్వం తాజాగా వీవీఐపీలకు భద్రత కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఈ నెల 7 నుంచి సెక్యూరిటీ కల్పిస్తామని కోర్టుకు తెలిపింది. గత వారం రాష్ట్రంలోని 434 మంది వీవీఐపీలకు భద్రత తొలగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Sidhu Moose Wala: కేంద్ర సంస్థలతో దర్యాప్తు.. అమిత్ షాకు లేఖ రాసిన సిద్ధూ కుటుంబం

ఆ మరునాడే సిద్ధూ హత్య జరిగింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్లే సిద్ధూ హత్య జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో సర్కారు దిగొచ్చింది. వీఐపీలకు గతంలోలాగే భద్రత కల్పిస్తామని చెప్పింది.