Covid-19 : బాలీవుడ్ తారలు కరీనా కపూర్,అమృత అరోరాకి కరోనా
బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృత అరోరా కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన టెస్ట్ లలో వీరిద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని.. కొద్ది రోజులుగా వీరితో సన్నిహితంగా మెలిగిన
Covid-19 : బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృత అరోరా కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన టెస్ట్ లలో వీరిద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని.. కొద్ది రోజులుగా వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరూ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ లు చేయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సూచించింది.
కాగా, గత కొన్ని రోజులుగా కరీనా, అమృత వరుసగా ముంబైలోని పాలు పార్టీలకు హాజరవుతున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు మాత్రం పాటించలేదని తెలుస్తుంది. గత వారం ముంబైలో అనిల్ కపూర్ కుమార్తె రియా కపూర్ నిర్వహించిన ఓ పార్టీకి సైతం వీరు హాజరయ్యారు. వీరితో పాటు కరిష్మా కపూర్, మలైకా అరోరా సహా పలువురు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. కాగా మలైకా అరోరాకు స్వయానా చెల్లెలే అమృతా అరోరా. కరీనాకు మలైకా, అమృత బెస్ట్ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అయితే కోవిడ్ 19 ప్రోటోకాల్ను ఉల్లంఘించి పార్టీలకు హాజరవడం వల్లే కరీనా కపూర్, అమృత అరోరాకి కరోనా సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, ముంబై నగరంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున, పెద్ద సమావేశాలు నిషేధించబడ్డాయి. ఈ క్రమంలో ఆదివారం పంజాబీ రాపర్ ఏపీ ధిల్లాన్ నిర్వహించిన కచేరీకి వేలాది మంది సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్క్లు లేకుండా పార్టీలు చేసుకోవడంతో ఈ ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇక, మహారాష్ట్ర వ్యాప్తంగా 18 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ALSO READ First Omicron Death : తొలి ఒమిక్రాన్ మరణం నమోదు.. ఎక్కడంటే..