Parliament Covid19 : పార్లమెంటులో కరోనా కలకలం.. 850కి పెరిగిన కేసులు
కోవిడ్ మహమ్మారి పార్లమెంటులో కలకలం రేపుతోంది. పార్లమెంటులో కరోనా బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య..
Parliament Covid19 : కోవిడ్ మహమ్మారి పార్లమెంటులో కలకలం రేపుతోంది. పార్లమెంటులో కరోనా బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 850కి పెరిగింది. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పార్లమెంటు అధికారులు అలర్ట్ అయ్యారు. సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఎలాంటి లక్షణాలు లేని వారే విధులకు హాజరుకావాలని, స్వల్ప లక్షణాలు ఉన్నా విధులకు రావొద్దని సూచించారు. అటు జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2.68 లక్షల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో అత్యధికంగా 24వేల 383 కేసులు నమోదు కాగా.. ముంబైలో 11వేల 317 కేసులు, బెంగళూరులో 20వేల 121 కేసులు, చెన్నైలో 8వేల 963 కేసులు, కోల్కతాలో 6వేల 867 కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో 1,22,684 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 14 లక్షల 17 వేల 820 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కోవిడ్ పాజిటివ్ రేటు 16.66 శాతానికి చేరింది. అదే సమయంలో కోవిడ్తో 402 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కోవిడ్ తో మొత్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4.85 లక్షల చేరింది.
China Manja : ప్రాణం తీసిన గాలిపటం మాంజా.. గొంతు తెగి అక్కడికక్కడే మృతి
మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లోనూ పంజా విసురుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటివరకు దేశంలో 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు వెలుగుచూశాయి. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు విజృంభించడంతో భారత్ లో ధర్డ్ వేవ్ ప్రారంభమైనట్టు వైద్య, ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.