Priyanka Gandhi: మరో యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. ‘మహిళా జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయనున్న ప్రియాంక

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ త్వరలో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో యాత్రను రెడీ చేస్తోంది. ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ప్రియాంకా గాంధీ కూడా యాత్ర చేయబోతున్నారు.

Priyanka Gandhi: మరో యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. ‘మహిళా జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయనున్న ప్రియాంక

Priyanka Gandhi: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ప్రజలకు చేరువయ్యేందుకు ఇప్పటికే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్ జోడో యాత్ర’ సాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ యాత్ర ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో యాత్రను సిద్ధం చేస్తోంది.

Elon Musk: ఎలన్ మస్క్‌కు ఎదురుదెబ్బ.. న్యూరాలింక్ సంస్థపై అమెరికా విచారణ.. కారణమేంటి?

ఆ పార్టీ మహిళా నేత, సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ ఈ యాత్ర చేపట్టబోతున్నారు. ‘మహిళా జోడో యాత్ర’ పేరుతో ప్రియాంక కూడా పాదయాత్ర చేస్తారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ యాత్ర మొదటి విడత రెండు నెలలపాటు సాగుతుంది. వచ్చే జనవరి 26 నుంచి మార్చి 26 వరకు ఈ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. దీనికి సంబంధించిన ప్రణాళికల్ని పార్టీ సిద్ధం చేస్తోంది. మహిళల్ని ఆకట్టుకునే లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహించనుంది కాంగ్రెస్. ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో మహిళల ఓట్లే విజేతల్ని నిర్ణయిస్తున్నాయి.

అందువల్ల మహిళలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. తమ పార్టీ మహిళలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ చెప్పుకొంటుంది. రెండు దశాబ్దాలుగా తమ పార్టీని మహిళే నడిపించిందని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సానుకూలంగా ఉన్నామని చెప్పింది.