Covid-19 in India : భారత్‌లో 24 గంటల్లో 188 కరోనా కేసులు

చైనాతో పాటు పలు దేశాలను మరోసారి హడలెత్తిస్తున్న కరోనా కేసులు భారత్ లో కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 188 కేసులు నమోదు అయ్యాయి.

Covid-19 in India : భారత్‌లో 24 గంటల్లో 188 కరోనా కేసులు

Covid-19 in India

Covid-19 in India : చైనాతో పాటు పలు దేశాలను మరోసారి హడలెత్తిస్తున్న కరోనా కేసులు భారత్ లో కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 188 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కోవిడ్ భారత్ లో క్రమేపీ వ్యాపిస్తోందనే చెప్పాలి. బుధవారం (డిసెంబర్ 28,2022) ఉదయానికి 188 కేసులు నమోదు కాగా ఈ కొత్త కేసులతో మొత్తం భారత్ లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3,468కి పెరిగాయి.

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 188 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఇటువంటి ఆందోళనా సమయంలో కూడా సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కరోజే 141 మంది కోలుకోవటం.

చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి ఊపందుకున్న క్రమంలో భారత్ అప్రమత్తమైంది. భారత్ లోనూ కేసులు అదుపులోనే ఉన్నాయని చెబుతున్నా కొత్త కేసులు నమోదు సంఖ్య పెరుగుతోంది. అయితే పలు దేశాలతో పోల్చితే భారత్ లో మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. జపాన్​లో 2 లక్షలకు పైగా కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.