Coronavirus : దేశంలో తగ్గిన కరోనా కేసులు

ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Coronavirus : దేశంలో తగ్గిన కరోనా కేసులు

Coronavirus

Coronavirus : ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 38,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన రిపోర్ట్ లో తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,04,874 గా ఉంది.

ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.51 శాతంగా ఉంది. గడిచిన 24గంటల్లో 219 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,40,752 కి చేరింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు దేశ వ్యాప్తంగా 43,903 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీ అయినా వారి సంఖ్య 3,21,81,995 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 68,75,41,762 మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తైంది.