కరోనా నుంచి కోలుకుంటున్న భారత్.. 24గంటల్లో 9,987కేసులు

  • Published By: vamsi ,Published On : June 9, 2020 / 05:43 AM IST
కరోనా నుంచి కోలుకుంటున్న భారత్.. 24గంటల్లో 9,987కేసులు

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. భారతదేశంలో కరోనావైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా కారణంగా బాధపడుతున్నవారి సంఖ్య మరియు చికిత్స తర్వాత కోలుకునే వ్యక్తుల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కొత్తగా కరోనా సోకగా.. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఇదే సమయంలో 331 మంది మరణించారు.  
     
అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి 4,785 మంది కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,29,917 చురుకైన కరోనా కేసులు ఉండగా, 1,29,215 మంది కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు సుమారు 50 లక్షల మంది నమూనాలను పరీక్షించగా.. ప్రతిరోజూ లక్షకు పైగా నమూనాలను పరిశీలిస్తున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 2,66,598కి చేరగా, మృతుల సంఖ్య 7,466గా ఉంది.

Read: రాబోయే సంవత్సరాలలో మరింత గడ్డు పరిస్థితి