Earthquake : జమ్ముకశ్మీర్ లో భూకంపం.. 10 రోజుల వ్యవధిలో మూడోసారి

జమ్ముకశ్మీర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్ వార్ లో భూమి కంపించింది.

Earthquake : జమ్ముకశ్మీర్ లో భూకంపం.. 10 రోజుల వ్యవధిలో మూడోసారి

earthquake

Earthquake : జమ్ముకశ్మీర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్ వార్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని తెలిపింది.

దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్ల లేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందూ ఊపిరి పీల్చుకున్నారు. జమ్ముకశ్మీర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గత 10 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. జనవరి 1వ తేదీన 3.8 తీవ్రతతో ఢిల్లీలో భూకంపం సంభవించింది.

Earthquake In Delhi, Haryana : ఢిల్లీ, హర్యానాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు

దీని ప్రభావంతో  జమ్ముకశ్మీర్ లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఈ నెల 5వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ లో 5.9శాతం భూకంప తీవ్రతతో భూమిలో కదలికలు వచ్చాయి. దీంతో జమ్ముకశ్మీర్ తోపాటు ఢిల్లీలో కూడా భూకంపం సంభవించింది.