మద్యం తాగి Tik tok : బతికున్న చేపను మింగి యువకుడు మృతి

  • Published By: nagamani ,Published On : June 12, 2020 / 07:12 AM IST
మద్యం తాగి Tik tok : బతికున్న చేపను మింగి యువకుడు మృతి

టిక్ టాక్ పిచ్చితో ఎంతోమంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈ పిచ్చితో చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అటువంటివాడే ఈ టిక్ టాక్ పిచ్చోడు అని అనుకోవాలి. వెరైటీ వీడియోలతో క్రేజ్ తెచ్చుకోవాలని..వ్యూస్ కోసం చేస్తున్న వెర్రితో ఓ డిగ్రీ విద్యార్థి టిక్‌టాక్ వీడియో కోసం ప్రయత్నించి చనిపోయాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిల్చిన ఈ ఘటన కర్నాటకలోని హోసూరులో చోటు చేసుకుంది. 

 

పార్వతీనగర్‌కు చెందిన శరవణన్‌ కుమారుడు వెట్రివేల్ అనే 22 సంవత్సరాల యువకుడు  డిగ్రీ చదువుతున్నాడు. టిక్ టాక్ వీడియోలు చేయటమంటే అతనికి పిచ్చి.  ప్రతిసారి కొత్తదనం చూపించాలని తాపత్రాయపడుతుంటాడు. దీంట్లో భాగంగానే ఎవ్వరూ చేయనిది తాను చేయాలనుకున్నాడు. పైగా మద్యం తాగి ఉన్నాడు. మరి మద్యం మత్తులో చేశాడో..కొత్తదనం కోసం చేశాడో గానీ..బతికున్న చేపను మింగుతూ వీడియో చేశాడు. అది కాస్తా గొంతులో అడ్డుపడిపోయింది. 

అది దిగటానికి వాటర్ తాగాడు.అయినా అది గొంతులోంచి కిందకు దిగలేదు. దీంతో ఊపిరి తీసుకోవటం కష్టమైపోయింది. నానా యాతనపడ్డాడు.అలా ఊపిరి ఆడకపోవడంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు.  ఊపిరి ఆడక గిలగిల్లాడిపోయాడు. 
అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించగా అప్పటికే వెట్రివేల్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. 

అందివస్తాడనుకున్న కొడుకు ఇలా అర్థాంతరంగా చనిపోవటంతో వెట్రివేల్ తల్లిదండ్రులు..కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Read: వ్యానులో గుట్టలుగా కుళ్లిపోయిన శవాలు..!! హడలిపోతున్న స్థానికులు