ఇదే కదా అదృష్టం అంటే: రిక్షావాలాకు రాత్రికి రాత్రే రూ.50లక్షలు వచ్చాయి

  • Published By: vamsi ,Published On : October 2, 2019 / 10:22 AM IST
ఇదే కదా అదృష్టం అంటే: రిక్షావాలాకు రాత్రికి రాత్రే రూ.50లక్షలు వచ్చాయి

ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిపోతుందో ఎవరూ చెప్పలేం.. ఓవర్ నైట్ కొందరిని అదృష్టం పట్టేస్తుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రిక్షా పుల్లర్ కు కూడా అటువంటి అదృష్టమే పట్టేసింది. ఓవర్ నైట్ రూ .50 లక్షల విలువైన లాటరీ జాక్‌పాట్ గెలుచుకుని గౌర్‌ దాస్‌ అనే రిక్షావాలా లక్షాదికారి అయిపోయాడు. పూర్బా బర్ధమాన్ జిల్లాలోని గుస్కర నివాసి అయిన గౌర్ దాస్ నాగాలాండ్ ప్రభుత్వ లాటరీలో మొదటి బహుమతిని గెలుచుకున్నారు.

అయితే లాటరీలు కొంతమంది తరచూ కొంటూ ఉంటారు. ప్రతీసారి అదృష్టం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే గౌర్‌ దాస్‌ మాత్రం తరచూ కొనే వ్యక్తి కాదు. నాగాల్యాండ్‌లోని దిమాపూర్‌ నగరంలో రిక్షా నడుపుని బతికే గౌర్‌ దాస్‌ తోటి రిక్షా యూనియన్‌ స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ రోజు ఎడతెరిపి వర్షం బాగా కురవడంతో పిక్‌నిక్‌ కి వెళ్లాలన్న ఆలోచన మానుకున్నాడు. అనంతరం ఇంటికి తిరిగొస్తుండగా ఓ వ్యక్తి ఎదురుపడి నాగాలాండ్‌ ప్రభుత్వ లాటరీ టికెట్లు కొనుమని బతిమిలాడాడు.

గౌర్‌ దాస్‌ జేబులో రూ.70 మాత్రమే ఉన్నాయని చెప్పినా లాటరీ అమ్మే వ్యక్తి ప్రాదేయపడడంతో ధర రూ. 30 పెట్టి టికెట్టు కొన్నాడు. ఈ లాటరికి సంబంధించి లేటెస్ట్ గా సెప్టెంబర్‌ 29వ తేదీన ఫలితాలు రాగా అందులో అతనికి ఫస్ట్ ప్రైజ్ రూ.50లక్షలు వచ్చాయి. మరునాడు బ్యాంకుకు వెళ్లి లాటరీ టికెట్‌ను డిపాజిట్‌ చేశాడు విజేత గౌర్‌ దాస్‌.