Road Accidents : రక్తమోడిన రహదారులు-రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి

సంక్రాంతి పండగ వేళ రహదారులు రక్తసిక్తమయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహాదారిపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదురు దుర్మరణం చెందగా... గుజరాత్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐ

Road Accidents : రక్తమోడిన రహదారులు-రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి

Road Accidents

Road Accidents :  సంక్రాంతి పండగ వేళ రహదారులు రక్తసిక్తమయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహాదారిపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదురు దుర్మరణం చెందగా… గుజరాత్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివీస్ ల్యాబ్ సమీపంలో బైక్ కారును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే ఘటనా స్ధలి వద్ద వేరొక బైక్ ను లార ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడి కక్కడే మరణించారు. మరణించిన ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినట్లు పోలీసులు తెలిపారు.

చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద మరో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొని ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. వీరిద్దరూ హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. వేర్వేరు ప్రమాద ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : India Covid-19 Update : దేశంలో కొత్తగా 2,71,202 కోవిడ్ కేసులు నమోదు
గుజరాత్ రాష్ట్రం బవస్కాంత జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు, థారోడ్-ధనేరా రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్-కారు ఒకటి నొకటి ఢీకొటడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్ధలి వద్ద కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. సమచారం తెలుసుకుని ఘటనా స్ధలికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.