ఓటు వేసిన సోనియా,ప్రియాంక

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 06:38 AM IST
ఓటు వేసిన సోనియా,ప్రియాంక

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని లోధి ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయలోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019) భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వెళ్లి ప్రియాంక ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని,మన దేశాన్ని కాపాడేందుకు తాము పోరాడుతున్నామని ఓటు వేసిన అనంతరం ప్రియాంక అన్నారు.అది మైండ్ లో పెట్టుకుని తాను ఓటు వేసినట్లు ఆమె అన్నారు.అంతకుముందు యూపీఏ చైర్ పర్శన్ సోనియాగాంధీ నిర్మాన్ భవన్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.సోనియా వెంట షీలా దీక్షిత్ కూడా ఉన్నారు.లోక్ సభ ఎన్నికల ఆరోదశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.