కేరళ,తమిళనాడు నుంచి పోటీ చేసే దమ్ము మోడీకి ఉందా?

  • Published By: venkaiahnaidu ,Published On : April 7, 2019 / 11:01 AM IST
కేరళ,తమిళనాడు నుంచి పోటీ చేసే దమ్ము మోడీకి ఉందా?

వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ ఆయన కాన్ఫిడెన్స్ కు నిదర్శనమని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు.ఉత్తరభారతంలోని అమేథీ,దక్షిణ భారతంలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీచేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం విజయం పట్ల ఆయనకున్న కాన్ఫిడెన్స్ ను తెలియజేస్తుందని శశిథరూర్ అన్నారు.కాబేయే ప్రధానమంత్రి మా ప్రాంతం నుంచి ఎన్నికవబోతున్నాడని దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో గిల్లి చూసుకునే ఉత్సాహం నెలకొందని థరూర్ తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ,ప్రధాని మోడీ థరూర్ విమర్శలు గుప్పించారు.

హిందువులు అధికంగా ఉన్న ప్రాంతం నుంచి పారిపోయేందుకే రాహుల్ వయనాడ్ ను సెలక్ట్ చేసుకున్నాడని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ…అధికార పార్టీ నేతలు మతదురభిమాన విధానాన్ని అవలంబిస్తున్నారని,ప్రధానమంత్రి నోటి నుంచి ఇటువంటి మాటలు రావడం బాధాకరం అని థరూర్ తెలిపారు.దేశ ప్రధాని..దేశంలోని ప్రజలందరికీ ప్రధాని అన్న విషయాన్ని మోడీ పట్టించుకోవడం లేదన్నారు.కేరళ,తమిళనాడు నుంచి పోటీ చేసే దమ్ము ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఉందా అని ధరూర్ ప్రశ్నించారు.మహారాష్ట్రలోని వార్థాలో జరిగిన ఓ ర్యాలీలో హిందువులు అధికంగా ఉన్న లోక్ సభ స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రతిపక్షం భయపడుతోందని ప్రధాని మోడీ అన్న విషయం తెలిసిందే.