Adibatla Kidnap Case : కిడ్నాప్‌కు ముందు మందు పార్టీ.. ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో 32మంది అరెస్ట్

కిడ్నాప్ కు ముందు పార్టీ ఇస్తానని వర్కర్స్ ను, బీహారీలను తన ఆఫీసుకి పిలిచాడు నవీన్ రెడ్డి. అందరికీ మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న వారందరినీ వైశాలి ఇంటికి తీసుకెళ్లాడు నవీన్ రెడ్డి. ప్లాన్ ప్రకారం వైశాలి ఇంటిపైన, కుటుంబసభ్యులపైన దాడి చేయించాడు.

Adibatla Kidnap Case : కిడ్నాప్‌కు ముందు మందు పార్టీ.. ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో 32మంది అరెస్ట్

Adibatla Kidnap Case : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో 32మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్, మూకుమ్మడి దాడి నేరాల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

కిడ్నాప్ కు ముందు పార్టీ ఇస్తానని వర్కర్స్ ను, బీహారీలను తన ఆఫీసుకి పిలిచాడు నవీన్ రెడ్డి. అందరికీ మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న వారందరినీ వైశాలి ఇంటికి తీసుకెళ్లాడు నవీన్ రెడ్డి. ప్లాన్ ప్రకారం వైశాలి ఇంటిపైన, కుటుంబసభ్యులపైన దాడి చేయించాడు. వైశాలి కిడ్నాప్ తర్వాత కిడ్నాపర్లు తలో దిక్కుకి పారిపోయారు. పోలీసులు 32మందిని అదుపులోకి తీసుకున్నారు. బొలెరో, కారుని స్వాధీనం చేసుకున్నారు.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అసలేం జరిగింది?

కిడ్నాప్‌ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 36మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిలో 32 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ సహా శివారు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.

తను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి సంబంధం చూస్తున్నారని తెలిసి నవీన్ రెడ్డి అనే యువకుడు 100 మందితో వెళ్లి యువతి ఇంటిపై దాడి చేసి ఆ యువతిని కిడ్నాప్‌ చేయడం సంచలనం రేపింది. ఈ కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నవీన్ రెడ్డిపై వైశాలి సంచలన ఆరోపణలు చేసింది. నవీన్‌రెడ్డి తనను చిత్రహింసలకు గురి చేశాడని వైశాలి మీడియా ముందు వాపోయింది. ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడలో నిన్న సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ ఘటనకు సంబంధించి వివరాలను ఆమె వెల్లడించింది.

Also Read..Adibatla Kidnap Case : ప్రేమా లేదు పెళ్లీ లేదు, వాడసలు మనిషే కాదు, నవీన్ రెడ్డి నా కెరీర్ నాశనం చేశాడు- ఆదిభట్ల కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్

‘‘నవీన్ తో ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటానని బంధువు ద్వారా సంప్రదిస్తే ఇష్టం లేదని చెప్పా. అప్పటి నుంచి నవీన్‌రెడ్డి వేధించడం మొదలుపెట్టాడు. ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేట్‌ చేసి.. నా మార్ఫింగ్‌ ఫొటోలు పెట్టాడు. బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ‘నువ్వంటే నాకిష్టం.. బాగా చూసుకుంటా. వచ్చేయొచ్చు కదా’ అనేవాడు. నో అని చెబితే ఇంటి ముందుకొచ్చి న్యూసెన్స్‌ చేసేవాడు.

నన్ను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన తర్వాత కారులో నవీన్‌రెడ్డి ఒక్కడే ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. జుట్టుపట్టుకుని ముఖంపై దాడి చేశాడు. మా పేరెంట్స్‌ కూడా అలా ఎప్పుడూ కొట్టలేదు. చాలా ఘోరంగా ట్రీట్‌ చేశాడు. ‘నాకిష్టం లేదు ఎందుకొచ్చావంటే’.. ‘నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నాకు దక్కకుంటే.. నిన్ను ఎవరికీ దక్కనివ్వను’ అంటూ టార్చర్ పెట్టాడు. నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోతుందని బెదిరించాడు. తాను చెప్పినట్టు వినకపోతే మా నాన్నను చంపేస్తానని బెదిరించాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పోలీసులు మాకు భద్రత కల్పించాలి. ఈ ఘటనతో నా కెరీర్‌ దెబ్బతింది. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. నవీన్‌రెడ్డి దొరికిపోయాడు కాబట్టి కాపాడుకునేందుకు అతని తల్లి అబద్దాలు చెబుతోంది. ఒక మహిళగా ఆలోచించాలి. మా తల్లిదండ్రులకు ఏమైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత. నవీన్‌రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. పెళ్లి జరిగిందని వారు చెబుతున్న రోజు నేను ఆర్మీ డెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా. కారు ఇన్సూరెన్స్‌లో నా పేరు నామినీగా పెట్టాడు.. దానికి నాకూ ఏం సంబంధం. నేను ఎక్కడా సంతకం చేయలేదు’’ అని మీడియా ముందు కన్నీటిపర్యంతం అయ్యింది వైశాలి.