Bandi Sanjay: కేసీఆర్ కుమార్తె కవిత రూ.లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారు: బండి సంజయ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మళ్ళీ కలపాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై స్పందిస్తూ... లిక్కర్ స్కామ్ ను పక్కదోవ పట్టించేందుకే ఏపీలోని వైసీపీ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత రూ.లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారని బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay: కేసీఆర్ కుమార్తె కవిత రూ.లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారు: బండి సంజయ్

Bandi Sanjay: ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మళ్ళీ కలిపే విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై స్పందిస్తూ… లిక్కర్ స్కామ్ ను పక్కదోవ పట్టించేందుకే ఏపీలోని వైసీపీ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత రూ.లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారని బండి సంజయ్ ఆరోపించారు.

ఏపీ సీఎం, తెలంగాణ సీఎం కలిసి నాటకాలు ఆడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కాగా, గుజరాత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై బండి సంజయ్ స్పందిస్తూ… ఈ ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణలోనూ గెలుస్తామని చెప్పారు. ఎన్నికల వేళ ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు ఎన్నో వ్యాఖ్యలు చేశాయని, వారి కుట్రలు ఫలించలేదని అన్నారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పారు. కాగా, ఆయన ప్రస్తుతం జగిత్యాల జిల్లా మొగిలిపేటలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపితే స్వాగతిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్నారు.

Congress-Himachal: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై ఖర్గే, రాహుల్ గాంధీ స్పందన