Tarun Chugh : బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి .. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ ఛుక్

 ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ రాకేష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.

Tarun Chugh : బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి .. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ ఛుక్

Tarun Chugh

Tarun Chugh..paidi rakesh reddy : ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ రాకేష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్ ఛుక్ మాట్లాడుతు..తెలంగాణాలో గడిచిన 9 ఏళ్లలో కుటుంబ పాలనా, వంచన పాలనా, అవినీతి పాలనే నడిచిందని ప్రజలు కెసిఆర్ పాలనపై విసుగెత్తి పోయారని మార్పు కోరుకుంటున్నారని తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని అన్నారు.

 

ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ పై ఆరోపణలు చేశారు. తెలంగాణ అవినీతిపాలనాను మోదీ నేతృత్వంలో అంతమొందిస్తామన్నారు.

 

తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని ధీమా వ్యక్తంచేశారు. స్వచ్ఛమైన తెలంగాణబిడ్డ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారటం చాలా సంతోషంగా ఉందని..రాకేష్ రెడ్డిని బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ అన్నారు.