Bandi Sanjay Kumar: రైతుల ముసుగులో దాడులు చేయించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

తెలంగాణలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు

Bandi Sanjay Kumar: రైతుల ముసుగులో దాడులు చేయించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

Bandio

Bandi Sanjay Kumar: తెలంగాణలో గురువారం నుంచి చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్. ఈక్రమంలో మంగళవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారులతో సమావేశమైన బండి సంజయ్ ఆమేరకు యాత్ర సాగే విధానంపై నేతలతో చర్చించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందని అన్నారు. రైతుల ముసుగులో మాపై దాడులు చేయించి, బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా అధికార పార్టీ నేతలు స్కెచ్ వేశారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులను భరించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్న బండి సంజయ్..దాడులు జరిగినా బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటిస్తారని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టేందుకు సీఎం కేసీఆర్ పన్నాగం పన్నారని..ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Also read:Yadagirigutta : శ్రీల‌క్ష్మీ నార‌సింహ స్వామిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర స్వామి

టీఆర్ఎస్ అరాచకాలు, అవినీతి-నియంత-కుటంబ పాలనను ప్రజల వద్ద ఎండగడతామని ఆయన అన్నారు. రైతుల కోసమంటూ ఢిల్లీలో దీక్షకు దిగిన కేసీఆర్..గంటసేపు కూడా దీక్ష చేయలేకపోయారని..దేశంలో ప్రకంపనలు స్రుష్టిస్తాననడం హాస్యాస్పదంగా ఉందంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఏప్రిల్ 14 నుండి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానుంది. ఈనేపధ్యంలో హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తమిళనాడు రాష్ట్ర్ర సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రులు విజయరామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Also read:Nagababu: ఆత్మహత్యలు చెసుకున్న కౌలు రైతులకు జనసేన అండగా ఉంటుంది: నాగబాబు