Covid-19: తాగేందుకు కల్లు లేక ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి.

కల్లు లేక ఆసుపత్రిని నుంచి పారిపోయాడు కరోనా రోగి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం చోటుచేసుకుంది. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు (55) కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.

Covid-19: తాగేందుకు కల్లు లేక ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి.

Covid 19 (4)

Covid-19: కల్లు లేక ఆసుపత్రిని నుంచి పారిపోయాడు కరోనా రోగి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం చోటుచేసుకుంది. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు (55) కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. బుధవారం ఉదయం ఆసుపత్రి నుంచి పారిపోయాడు. రోజు ఉదయం చెకప్ కి వచ్చే వైద్యులు రోగి లేకపోవడంతో సిబ్బందిని అడిగారు.

తమకు తెలియదని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌ అధికారులు తనిఖీ చేపట్టారు. బాధితుడు సంగమేశ్వర కాలనీలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఓ మూలన అర్ధనగ్నంగా కూర్చొని కనిపించాడు. దీంతో అతడిని ఆసుపత్రి నుంచి ఎందుకు వచ్చావని పోలీసులు ప్రశ్నించారు. ఆసుపత్రిలో తనకు కల్లు దొరకడం లేదని అందుకే బయటకు వచ్చానని సమాధానం ఇచ్చాడు.

వెంటనే అంబులెన్స్ ఎక్కాలని పోలీసులు కరోనా బాధితుడిని కోరారు. అయితే అతడు అందుకు అంగించారించలేదు. తనకు కల్లు పోస్తేనే ఆసుపత్రికి వస్తానని బీష్మించుకు కూర్చున్నాడు. దీంతో పోలీసులు రెండు లీటర్ల కల్లు తీసుకొచ్చి కరోనా బాధితుడి చేతిలో పెట్టారు. అది తాగిన తర్వాత అతడిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.