CM KCR : ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు : సీఎం కేసీఆర్

మెడికల్ షాపులు, ఫర్టిలైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామన్నారు. బార్, వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు పెట్టామని పేర్కొన్నారు. ప్రతి దళిత కుటుంబానికి చేయూత అందిస్తామని చెప్పారు.

CM KCR : ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు : సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR janagama : పేదరికం నుంచి దళితులు బయటపడాలని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ఇస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు ఇస్తామని చెప్పారు. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు వస్తుందన్నారు. సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల కుటుంబాలకు దళిత బంధు వస్తుందన్నారు. జనగామ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

మెడికల్ షాపులు, ఫర్టిలైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామని గుర్తు చేశారు. బార్, వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు పెట్టామని పేర్కొన్నారు. ప్రతి దళిత కుటుంబానికి చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారు. చనిపోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా ఇస్తున్నామని చెప్పారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రైతుబీమా ఇస్తున్నామని పేర్కొన్నారు.

CM KCR : జనగామకు మెడికల్ కాలేజ్, పాలకుర్తికి డిగ్రీ కాలేజ్ : సీఎం కేసీఆర్

గతంలో బచ్చన్నపేటను చూస్తే తనకు బాధేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో జనగామను చూసి ప్రొ.జయశంకర్ ఎంతో బాధపడేవారని గుర్తు చేశారు. మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకుని వెళ్లేవారని పేర్కొన్నారు. తెలంగాన వచ్చాక బచ్చన్నపేట బతుకు మారిందన్నారు. తెలంగాణ వచ్చాక కరెంట్ బాధలు పోయాయని పేర్కొన్నారు.

జనగామాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పారు. పాలకుర్తికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని అన్నారు. గణపురంకు కూడా డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.