Neeraj Wife Sanajana : నన్ను, నా బాబుని కూడా చంపేస్తారు.. పోలీసులు పట్టించుకోలేదు- నీరజ్ భార్య సంజన

పెళ్లి చేసుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నా భర్తను కోల్పోయాను.(Neeraj Wife Sanajana)

Neeraj Wife Sanajana : నన్ను, నా బాబుని కూడా చంపేస్తారు.. పోలీసులు పట్టించుకోలేదు- నీరజ్ భార్య సంజన

Neeraj Wife Sanajana

Neeraj Wife Sanajana : హైదరాబాద్ బేగంబజార్ లో చోటు చేసుకున్న పరువు హత్యపై నీరజ్ కుటుంబసభ్యులు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. మృతుడు నీరజ్ ఇంటి నుండి షాహినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. నీరజ్ భార్య సంజన, కుటుంబ సభ్యులు, రాజస్తాన్, బీహార్, మహారాష్ట్ర నుండి వచ్చిన మార్వాడి సమాజ్ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయాలని బాధిత కుటుంబం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

సంజన-నీరజ్ భార్య
నాకు, నా బిడ్డకు ప్రాణ హాని ఉంది. వాళ్లు మా ఇద్దరిని కూడా చంపేస్తారు. హత్య చేసిన వాళ్లు నాకు బంధువులే. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. పెళ్లి చేసుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నా భర్తను కోల్పోయాను. ఇలాంటి ఘటనలు పోలీసులు ఎందుకు ఆపలేకవుతున్నారు.(Neeraj Wife Sanajana)

Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన

నీరజ్ బేగంబజార్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. పరువు పోవడంతో పాటు అవమాన భారంతోనే నీరజ్‌ ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. పెళ్లి, బాబు పుట్టాక యాదవ అహీర్ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేసినట్టు నిందితులు తెలిపారు. దీంతో యాదవ్ సమాజ్‌లో జరిగే కార్యక్రమాలకు సంజన కుటుంబ సభ్యులను పిలవని పరిస్థితులు నెలకొన్నాయని… ఎక్కడికి వెళ్లినా సంజన కుటుంబ సభ్యులు అవమాన భారంతో కుంగిపోయారని చెప్పారు. ఆ ఆవమాన భారంతోనే నీరజ్ ను హత్య చేశామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.

ఎలాగైనా నీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్న నిందితులు.. జుమేరాత్ బజార్‌లో కత్తులు, రాడ్లు కొన్నారు. ముందుగా ఒక బాలుడితో రెక్కీ చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగారు. బైక్‌పై వెళుతున్న నీరజ్ కంట్లో కారం చల్లిన నిందితులు ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఘటనకు ముందు నిందితులు పీకల దాకా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.

Saroornagar Honour Killing : సరూర్ నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

మే 20వ తేదీ రాత్రి షాహినాథ్ గంజ్‌ పీఎస్ పరిధిలోని మచ్చీ మార్కెట్‌లో ఈ పరువు హత్య జరిగింది. రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. అందరూ చూస్తుండగానే నీరజ్‌ పై దాడి చేశారు. బండరాయితో మోదారు. తర్వాత కత్తులతో పొడిచి చంపారు. 20 కత్తిపోట్లకు గురైన నీరజ్.. స్పాట్ లోనే చనిపోయాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కక్షతోనే నీరజ్ ను.. అతని భార్య సోదరులు హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది.

చాలాకాలంగా నీరజ్, సంజన ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంజనను బయటికి వెళ్లకుండా కట్టడి చేశారు. అయినా చాటుగా నీరజ్ తో ప్రేమాయణం సాగించింది సంజన. గతేడాది ఏప్రిల్ లో సంజనకు మరో అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు కుటుంబ సభ్యులు. దీంతో పెళ్లికి మూడు నెలల ముందు ఇంటి నుంచి పారిపోయింది సంజన. ఆర్య సమాజ్ లో నీరజ్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సంజన కుటుంబ సభ్యులు ఆగ్రహం చెందారు. తమ కూతురు చనిపోయిందంటూ ఇంట్లో సంజన ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు తల్లిదండ్రులు.

దాదాపు ఏడాది పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న సంజన.. బాబు పుట్టాక తల్లితో మాట్లాడింది. అప్పుడు కూడా బేగంబజార్ కు రావొద్దని సంజనను ఆమె తల్లి హెచ్చరించింది. అయినా తన తల్లి మాటను లెక్కచేయకుండా బేగంబజార్ లోనే నివసించింది సంజన. దీంతో మరింత కోపం పెంచుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. నీరజ్ ను చంపేశారు. ఈ కేసులో 24 గంటలలోపే సంజన సోదరుడు సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.