Telangana : హైదరాబాద్ అభివృద్ది రజనీకాంత్కు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు అర్థంకావట్లేదు : హరీశ్ రావు సెటైర్లు
22 ఏళ్ల తరువాత నేను హైదరాబాద్ వచ్చానని ..నేను హైదరాబాద్ లో ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని ఆశ్చర్యపోయానని అంతగా హైదరాబద్ అభివృద్ధి చెందింది అని రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు స్పందించారు. రజనీ గజనీ అంటూ సెటైర్లు..
Telangana : కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన రజనీకాంత్ కు అర్థమైంది గానీ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉండే గజనీలకు అర్థం కావటంలేదు అంటే సెటైర్లు వేశారు. కాగా..విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు హాజరు కావటానికి శుక్రవారం (ఏప్రిల్ 28,2023) తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ విచ్చేశారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఆ తరువాత గన్నవరం విమానశ్రయానికి చేరుకుని అక్కడ టీడీపీ నేతలు ఘనస్వాగతంతో విజయవాడ చేసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను తలైవా ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతు..హైదరాబాద్ నగరాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయానని హైదరాబాద్ లో ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని అనిపించిందని అన్నారు.
ఆయన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ..22 ఏళ్ల తరువాత నేను హైదరాబాద్ వచ్చానని ..నేను హైదరాబాద్ లో ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని ఆశ్చర్యపోయానని అంతగా హైదరాబద్ అభివృద్ధి చెందింది అని తెలిపారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు బాగా అభివృద్ది చెందాయని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కంది మండల పరిధిలోని కాశీపూర్లో బసవ భవన్ నిర్మాణానికి మంత్రి హరీశ్రావు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతు హైదరాబాద్ అభివృద్ధి గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల గురించి హరీశ్ రావు ప్రస్తావిస్తు కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన రజనీకాంత్ కు హైదరాబాద్ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీలో ఉండే గజనీలకు అర్థం కావట్లేదు అంటూ సెటైర్లు వేశారు.