Omicron : ఒమిక్రాన్ టెన్షన్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ తో పాటు..

Omicron : ఒమిక్రాన్ టెన్షన్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Omicron Tension

Omicron : ప్రపంచదేశాలను ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ ఆ తర్వాత బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయల్, బ్రిటన్ దేశాలకు పాకింది. బీ.1.1.529 ను ఆందోళనకర వేరియెంట్‌గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మహమ్మారితో చాలా దేశాలు అప్రమత్తమై.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్‌ కూడా అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యారోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ తో పాటు, ఒమిక్రాన్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సిన్ వేగవంతంపై అధికారులతో చర్చించారు. కాగా భారత్ లో ఇప్పటివరకు ఒమిక్రాన్ వైరస్ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికి ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది.

”ఎయిర్ పోర్టులో కరోనా టెస్టులు చేస్తున్నాం. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, బోట్స్ వానా, హాంకాంగ్ తో పాటు ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు హోం ఐసోలేషన్ ఆంక్షలు విధిస్తున్నాం. వారంతా హోమ్ క్వారంటైన్ లో తప్పకుండా ఉండాల్సిందే” అని హరీష్ రావు స్పష్టం చేశారు. కాగా, కరోనా కట్టడికి రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అన్న మంత్రి.. రెండో డోసు కోసం ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

Stop Charging Phones : ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెడితే..జీతం కట్!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తోంది. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువని నిపుణులు హెచ్చరించారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూసిన దేశాలపై ప్రపంచ దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి.

ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ”అంతర్జాతీయ ప్రయాణీకులపై దృష్టి పెట్టాలి. కరోనా పరీక్షలు పెంచాలి. హాట్ స్పాట్ లను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ ను వెంటవెంటనే పంపేలా జాగ్రత్తలు తీసుకోవాలి” అని గైడ్ లైన్స్ లో కేంద్రం సూచించింది.