మెట్రో రైలులో పవన్ కళ్యాణ్ ప్రయాణం, రైతుతో ముచ్చట్లు

  • Published By: naveen ,Published On : November 5, 2020 / 11:07 AM IST
మెట్రో రైలులో పవన్ కళ్యాణ్ ప్రయాణం, రైతుతో ముచ్చట్లు

pawan kalyan hyderabad metro rail: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు. పవన్ ఏంటి మెట్రో రైలులో జర్నీ చేయడం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ. అవును, పవన్ కళ్యాణ్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో భాగంగా మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో పవన్ కళ్యాణ్ జర్నీ చేశారు.

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం:
గురువారం(నవంబర్ 05,2020) ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో పవన్ ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. ఈ మూవీ షూటింగ్ కోసం మియాపూర్‌ వెళ్లింది. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో రైలెక్కి అభిమానులను ఆశ్చర్యపరిచారు పవన్. అమీర్‌పేట స్టేషన్ లో ట్రైన్ మారారు.

రైతుతో మాట్లాడిన పవన్:
ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో పవన్ మాట్లాడారు. ద్రాక్షారామానికి చెందిన రైతు సత్యనారాయణతో పవన్ మాట్లాడారు. పంటలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని ఆ రైతు పవన్ దగ్గర వాపోయారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ రైతు ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణం తనకు ఇదే మొదటిసారి అని రైతు చెప్పగానే పవన్‌ నవ్వుతూ మీకే కాదు.. నాకు కూడా ఇదే మొదటి సారి అని అన్నారు. పవన్ వెంట నిర్మాత దిల్ రాజు, చిత్ర యూనిట్ ఉన్నారు.