హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కాల్పుల కలకలం.. భార్యా పిల్లలపై తుపాకీతో ఫైరింగ్
తెలంగాణలో గన్ కల్చర్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల కిందట ఓ టీనేజ్ యువకుడు గన్తో బెదిరించిన ఘటన మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీలో కాలాపత్తర్ చెందిన హబీబ్ హష్మీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఇంట్లో కాల్పులకు పాల్పడ్డాడు.
gun firing on wife and children : తెలంగాణలో గన్ కల్చర్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నచిన్న విషయాలకే గన్లను బయటకు తీస్తూ ఎదుటి వారిని బెదిరిస్తున్నారు. నెల రోజుల కిందట ఓ టీనేజ్ యువకుడు గన్తో బెదిరించిన ఘటన మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీలో కాలాపత్తర్ చెందిన హబీబ్ హష్మీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఇంట్లో కాల్పులకు పాల్పడ్డాడు. బిలాల్ నగర్లోని తన ఇంట్లో హబీబ్ హష్మీ తన భార్యా ఇద్దరు పిల్లలపై కాల్పులకు తెగబడ్డాడు.
గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసైన హబీబ్.. సాయంత్రం ఇంటి పేపర్లు ఇవ్వాలంటూ భార్య, కుమారుడితో గొడవ పడ్డాడు. పేపర్లు ఇవ్వమంటూ చెప్పడంతో ఆగ్రహించిన హబీబ్ ఇంట్లోకి వెళ్లి లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు. దీంతో విచక్షణ కోల్పోయిన హష్మీ లైసెన్స్డ్ రివాల్వర్తో కుటుంబ సభ్యులపైకి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
అయితే గురి తప్పి బుల్లెట్లు గోడకు తగలడంతో వారికి ప్రమాదం తప్పింది. తృటిలో కాల్పుల నుంచి తప్పించుకున్న కుమారుడు ఉమర్ హష్మీ వెంటనే కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు హబీబ్ హష్మీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యులపై కాల్పులు జరిపిన హబీబ్ హష్మీని అదుపులోకి తీసుకున్నామని.. గన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సిటీ పరిధిలో మొత్తం 10 వేల మందికి పైగా గన్ లైసెన్స్ కలిగి ఉన్నారు. లైసెన్సు పొందిన వారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు ఉన్నారు. అయితే వీరిలో కొద్ది మంది ఆత్మరక్షణ కోసం కాకుండా ఎదుటి వారిని బెదిరించేందుకు తమ ఆయుధాలు ఉపయోగిస్తున్నారు.
ఇవి కాకుండా బీహార్, ఉత్తర్ప్రదేశ్లకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా నాటు తుపాకులు తెచ్చి సిటీలో యూత్కి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో చాప కింద నీరులా నగరంలో గన్ కల్చర్ విస్తరిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.