Telangana Corona : తెలంగాణలో కొత్తగా 172 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 804 మందికి కరోనా పరీక్షలు చేయగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో ఇద్దరు కోవిడ్ తో మృతి చెందారు.

Telangana Corona : తెలంగాణలో కొత్తగా 172 కరోనా కేసులు

Telangana Corona

Telangana Corona : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 804 మందికి కరోనా పరీక్షలు చేయగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో ఇద్దరు కోవిడ్ తో మృతి చెందారు. 167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,312 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,65,599 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3వేల 741 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3వేల 972కి పెరిగింది.

YouTube: యూట్యూబ్‌లో ఫ్యాన్ వార్‌కి చెక్.. ఇక ఆ కౌంట్ కనిపించదు

వ్యాక్సిన్ వచ్చినా కరోనా నిబంధనలు పాటించాల్సిందే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించాల్సిందే, భౌతిక దూరం పాటించాల్సిందే. ఇక వైరస్‌ను జయించేందుకు రెండు డోసుల టీకా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలామంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. కాగా, బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. అయినప్పటికి జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు.