Munugode Bypoll: మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారపర్వానికి మరికొద్దిసేపట్లో తెరపడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

Munugode Bypoll: మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు

munugode bypoll

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారపర్వానికి మరికొద్దిసేపట్లో తెరపడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఈటల కార్లు ధ్వంసం అయ్యాయి. ఈటల ప్రచారారం చేస్తుండగా ఈ ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.

Munugode Bypoll: చండూరు బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్‭లోని హైలైట్స్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉద్రిక్తత వాతావరణం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రచారానికి చివరి రోజు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పలివెలలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను టీఆర్ఎస్ కార్యకర్తలు చించివేశారు. ఈటల వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఎమ్మెల్యే ఈట రాజేందర్ మండిపడ్డారు. ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు.

Munugode By Poll : మునుగోడు ప్రచారానికి ముగింపు .. స్థానికేతలు వెళ్లిపోవాలని కలెక్టర్ హెచ్చరిక

పలివెలలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణంచోటు చేసుకోవటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నియోజకవర్గం వ్యాప్తంగా పటిష్ట బందోబస్తుతో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ ఘర్షణ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతుందని, ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సమయమనం పాటించాలని హరీష్ రావు అన్నారు. బీజేపీ కుట్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు పడొద్దంటూ సూచించారు.