YS Jagan: 18వ రోజుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర

ఉందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు జగన్.

YS Jagan: 18వ రోజుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర

YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర 18వ రోజుకు చేరుకుంది. కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో జగన్ ఇవాళ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాజానగరం మండలం ఎస్టీ రాజాపురం నుంచి యాత్ర ప్రారంభమైంది.

ఉందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో వైసీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

అక్కడి నుంచి పిఠాపురం బైపాస్ గొల్లప్రోలు బైపాస్ చేబ్రోలు బైపాస్ మీదుగా కత్తిపూడి బైపాస్ అన్నవరం మీదుగా తుని చేరుకోనుంది జగన్ బస్సు యాత్ర. పాకరావుపేట చేరుకుని గొడిచెర్ల రాత్రికి బస చేయనున్నారు సీఎం జగన్. నేడు అనకాపల్లి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. రెండు జిల్లాల మీదుగా 8 నియోజకవర్గాల్లో సాగనుంది బస్సు యాత్ర. ఎన్నికల వేళ జగన్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

 Also Read: దెందుటూరుపై బీజేపీ గాలం.. దెందులూరు వదులుకోవడంపై టీడీపీ టెన్షన్!