AP Covid Update : ఏపీలో కొత్తగా 231 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 231 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 యాక్టివ

Ap Covid Updates
AP Covid Update : ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 231 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,718 కి చేరింది. వీరిలో 20,51,082 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు కృష్ణా, మరోకరు గుంటూరు జిల్లా వాసులు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,403కు చేరింది.
Also Read : Ganja Seized : షాద్నగర్లో ఐదున్నర కిలోల గంజాయి స్వాధీనం
నిన్నటివరకు రాష్ట్రంలో 2,98,05,446 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి నిరోధానికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం, అక్టోబర్ 9వతేదీ సాయంత్రం 6 గంటల సమయానికి 109,59,93,275 మందికి వ్యాక్సిన్ వేశారు.

Andhra Pradesh Covid Cases Update