Gold Rate Today : పండగ వేళ బంగారం కొనుగోలుదారులకు బిగ్‌షాక్‌.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శనివారం ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Rate Today : పండగ వేళ బంగారం కొనుగోలుదారులకు బిగ్‌షాక్‌.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా?

Gold Rate

Updated On : January 13, 2024 / 10:47 AM IST

Gold And Silver Prices Today : 2024 ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అయితే, శుక్రవారం మాత్రం స్వల్పంగా బంగారం ధర పెరిగింది. శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో పండుగ వేళ మహిళలకు బంగారం ధరలు బిగ్‌షాక్‌ ఇచ్చాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 300 పెరగ్గా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 320 పెరిగింది. వెండిధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరిగింది.

Gold Price Today

తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారంపై రూ. 300 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58,000 చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270 వద్దకు చేరింది.

Gold Rate

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,420కు చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270 వద్దకు చేరింది.
– చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.58,450 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,760గా నమోదైంది.

Gold

పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శనివారం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,800కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.76,500కు చేరింది. బెంగళూరులో మాత్రం వెండి ధర తగ్గింది. కిలో వెండి పై రూ. 250 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.73,250 వద్ద కొనసాగుతోంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.