విషాదం : బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతి
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.
మంచిర్యాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. గద్దెరగడ వద్ద బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వారికి వైద్యం అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.