వాక్సిన్ వచ్చినా, యేడాది వరకు కరోనా నిబంధనలు తప్పవ్
Covid-19 vaccine : కోవిడ్ వ్యాక్సిన్ రాబోతోందనగానే జనం రిలాక్స్ అయిపోతున్నారు. చాలామంది మాస్క్ లు వాడకపోవడం తమ ధైర్యానికి సింబలనుకుంటున్నారు.
వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, కోవిడ్ నిబంధనలు మరో యేడాదిపాటు కొనసాగించాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సిన్ వచ్చినా అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే బ్రిటన్ లాంటి చిన్నదేశానికే ఆరునెలల నుంచి యేడాది వరకు పడుతుందని అంచనా. మరి ఇండియాలాంటి 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఎన్నేళ్లుపడుతుంది? కనీసం రెండేళ్లన్నది అంచనా. అందుకే 2022 నాటి వరకు ఇండియాలో మాస్క్, కోవిడ్ నిబంధనలు తప్పవని అంటున్నారు.
కరోనా నుంచి రక్షించే వాక్సిన్ వస్తే social distancing rules పాటించక్కర్లేదని, అంతా మామూలైపోయినట్లేనని ఎక్కువమంది అనుకొంటున్నారు. ఇది నిజం కాబోదని Imperial College London నిపుణుల బృందం అంటోంది.
covid symptoms కొత్తవి బైటపడుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లుకూడా మరికొన్ని నెలలపాటు కోవిడ్ నిబంధనలను అనుసరించాల్సిందేనని తేల్చేశారు. వచ్చే మార్చికి, కోవిడ్ వ్యాక్సిన్ రెడీ అన్నది అందరి అంచనా.అలాగని ఎప్రిల్ నుంచి ప్రపంచమేమీ మారిపోదని, నార్మల్ కాబోదని అంటున్నారు. ముందు ప్రయార్టీ వర్గాలకు వ్యాక్సిన్ వేస్తారు. ఆ తర్వాతే మిగిలిన ప్రజలకు వ్యాక్సిన్. అంటే వీధిలోని 25 ఏళ్ల కుర్రాడికి చివరికి అందుతుంది.
ముందుగా ఆరు నుంచి యేడాదిలోపు కనీసం ఆరు వ్యాక్సిన్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. డబ్బున్న దేశాలన్నీ ముందుగానే వ్యాక్సిన్ డోసులను బుక్ చేసుకున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ అందరికీ సమానంగా వ్యాక్సిన్ డోసులను ఎలా పంచాలో ఒక ప్లాన్ ను సిద్ధం చేస్తుంది.
Oxford University వ్యాక్సిన్ ముందువరసలో ఉంది. దేశంలోని సీరమ్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ఇదే ఈ యేడాదిలోనే క్లినికల్ ట్రయల్స్ ను పూర్తిచేసి, ఫలితాలను ప్రకటించనుంది. భారత్ బయోటెక్ కూడా ఈయేడాది చివరి నాటికి ఫలితాలను ప్రకటించొచ్చు. ఇదే coronaకి indian vaccine.
70 ఏళ్లుదాటినవాళ్లు, హెల్త్ వర్కర్లు, కోవిడ్ వారియర్స్కు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మిగిలిన వారికి.