కరోనా రాకుండా ఉండాలంటే..ఈ మంత్రం జపించండి..దలైలామ సూచన

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడాలిస్తోంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వందల సంఖ్యలో మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తౌమతోంది. దీనిపై ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే..తారా మంత్రి పఠించాలంటూ సూచించారు.
* కరోనా వైరస్ కాటుకు బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
* చైనాలోని భారతీయులు ఆందోళనలో ఉన్నారు.
* వారందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
* ఇప్పటికే.. చైనాకు రెండు విమానాలను పంపించింది.
* బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం కూడా.. ఆ దేశ దౌత్య అధికారులతో చర్చలు జరుపుతోంది.
* ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయుల కోసం హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.
ఓం తారే..తుత్తారే..తురే సోహా..అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్ను తన అనుచరులో కోసం దలైలామా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. దలైలామా చెప్పిన ఈ మంత్రం చైనాలో వైరస్లాగానే వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ దరిచేరుకుండా..వ్యాప్తి చెందకుండా ఉంటుందంటున్నారు.
* ఇక కరోనా వైరస్ విషయానికి వస్తే..చైనా మొత్తం కకావికలమౌతోంది. నగరాలే స్తంభించిపోతున్నాయి.
* ఈ వైరస్ దెబ్బకు చైనీయులు బెంబేలెత్తిపోతున్నారు.
* ఈ వైరస్ వ్యాపించి..170 మంది చనిపోవడం తీవ్ర ఆందోనలు రేకేత్తిస్తోంది.
* ఇంకా 8వేలకు మందికి పైగానే కరోనా సోకిందని అంచనా వేస్తున్నారు.
* చైనాలో ఉన్న విదేశీయులు భయంతో వణికిపోతున్నారు.
Read More : కరోనా కాటు..170 మంది మృతి : చైనాకు భారత్ విమానాలు