Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ పై ఓటింగులో ఇండియా వైఖరిపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

ఐరాస తీర్మానానికి అనుకూలంగా 120 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో భారతదేశం, కెనడా, జర్మనీ, బ్రిటన్‌తో సహా 45 దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి.

Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ పై ఓటింగులో ఇండియా వైఖరిపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి నేటితో 22వ రోజు. ఈ యుద్ధంలో ఇరువైపులా ఇప్పటి వరకు ఎనిమిది వేల మందికి పైగా మరణించారు. అదే సమయంలో ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జోర్డాన్ ఒక ముసాయిదాను సమర్పించింది. అయితే, ఈ ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండడంపై విపక్షాలు భారత విదేశాంగ విధానంపై ప్రశ్నలు సంధించాయి.

ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలు
ప్రభుత్వ ఈ చర్యను విమర్శిస్తూ మహాత్మా గాంధీ మాటల్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘‘ఒక కన్ను అనే సూత్రం మొత్తం ప్రపంచాన్ని అంధుడిని చేస్తుందని గాంధీ అన్నారు. గాజాలో కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి ఓటింగ్‌లో పాల్గొనడానికి మన దేశం దూరంగా ఉన్నందుకు నేను షాక్ అయ్యాను. ఇది బాధాకరం’’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఏం చెప్పారు?
ఇక ఇదే విషయంపై, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గందరగోళంలో ఉందని, ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతోందని అన్నారు. పాలస్తీనాకు మద్దతివ్వడమే భారత్ విధానమని, ఇజ్రాయెల్ కాదని ఆయన స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వంపై ఓవైసీ విమర్శలు
తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిస్తూ జోర్డాన్ తీసుకొచ్చిన ముసాయిదాపై ఓటింగ్‌లో భారత ప్రభుత్వం పాల్గొనలేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. భారత ప్రభుత్వం ఓటింగ్‌లో పాల్గొనకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయని ఆయన అన్నారు. ఇది రాజకీయ సమస్య కాదని, మానవతా సమస్యని ఓవైసీ అన్నారు.

ప్రతిపాదనకు అనుకూలంగా 120 ఓట్లు
ఈ ఐరాస తీర్మానానికి అనుకూలంగా 120 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో భారతదేశం, కెనడా, జర్మనీ, బ్రిటన్‌తో సహా 45 దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి.