రైతు ‘పంట’పండింది : అమెరికా అధికారిణితో పెళ్లి 

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 05:59 AM IST
రైతు ‘పంట’పండింది : అమెరికా అధికారిణితో పెళ్లి 

Updated On : March 24, 2019 / 5:59 AM IST

హోషంగాబాద్ : అమెరికా అమ్మాయిలు ఆంధ్రా అబ్బాయిలను పెళ్లి చేసుకోవటం..వంటి వార్తలు వింటూనే ఉంటాం. ఖండాంతారాలలో ఉండేవారిని కూడా దగ్గర చేసే సోషల్ మీడియా దిగ్గజం  ఫేస్ బుక్ పుణ్యమా అని ఓ రైతు పంట (పెళ్లి అయ్యింది) పడింది. ఏకంగా అమెరికా అధికారిణి ఓ రైతును వివాహం చేసుకుంది. ఇది మధ్యప్రదేశ్ లోని హోషంగా బాద్ లోని శివ్నీమాల్వాలో జరిగింది. 

  
బోసోనీ గ్రామానికి చెందిన  దీపక్ రాజ్‌పూత్‌ను అమెరికాకు చెందిన జెలీ లిజోథ్ మనువాడింది. ఫేస్‌బుక్‌లో మొదలైన వీరి పరిచయం వివాహానికి దారితీసింది. ఈ క్రమంలో రంగుల వేడుక హోలీ పండుగ రోజున వీళ్లిద్దరు వివాహం చేసుకున్నారు. జోలీ‌‌లిజోథ్ అమెరికాలోని సౌత్ అమెరికాలోని ఆవ్లీటాస్ బొలీవియాలో ఉంటున్న లిజోథ్ అక్కడ మానవవనరుల శాఖలో అధికారిణిగా పనిచేస్తున్నారు. దీపక్ రాజ్‌పూత్‌కు ఫేస్ బుక్ లో పరిచయం అయిన లిజోథ్‌ మధ్య ఆరు నెలలుగా వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు. తరువాత  రెండు నెలల క్రితం లిజోథ్ భారత్ కు వచ్చారు. 
 

ఈ క్రమంలో వీరిద్దరు కలుసుకుని హోలీ పండుగ రోజు..నర్మదానది ఒడ్డున ఉన్న చిత్రగుప్త మందిరంలో వివాహం చేసుకున్నారు. అనంతరం హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత దేశంలో ఉండే రైతులను వివాహం చేసుకోవటానికి యువతులు ముందుకురాని తరుణంలో  ఏకంగా అమెరికాలో ప్రభుత్వం అధికారిణిగా పనిచేస్తున్న యువతి మనదేశపు  రైతన్నను వివాహం చేసుకోవటం ఓ విశేషమైతే..వారిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.